శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (15:14 IST)

కరోనా సోకి వెంటిలేటర్‌పై గర్భిణీ.. పురుడు పోసిన విశాఖ వైద్యులు

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకి నెలలు నిండడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది.
 
దీంతో డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్​ఆర్​ బ్లాక్​లో విజయవంతంగా శస్త్రచికిత్స పురుడుపోశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గర్భిణీలకు సిజేరియన్ చేయగా పది రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలపగా గర్భిని కుటుంబం వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.