1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 1 మే 2021 (09:12 IST)

రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకూడదు: సీఎం జగన్

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిించారు. ఈ నేపధ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు.
 
ఆయన ఈ సందర్భంగా చెపుతూ... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాడుతున్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది.
 
ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ వారు 2 ట్యాంకర్లను విజయవాడ నుండి కానీ తిరుపతి నుండి కానీ వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పుకొన్నారు. 
 
భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను  ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది. ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.