మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (09:35 IST)

ప్రకాశం జిల్లాలో వింత వ్యాధితో పావురాళ్ల మృత్యువాత

దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ ఇన్‌ఫ్లూ యెంజా వ్యాధులతో వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎపిలోనూ ఇటీవల కోనసీమ జిల్లాల్లో కోళ్లు వందల సంఖ్యలో వరుసగా మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపడంతో ఎపిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగు రోజుల నుండి పావురాళ్ళు మృతుచెందుతున్నాయి. స్థానిక నాగులపాడు రోడ్డులోని శివసాయి రెసిడెన్సీ వద్ద పావురాళ్ళ మూతిపై బొబ్బర్లు ఏర్పడి వింత వ్యాధితో గుంపులు గుంపులుగా మృత్యువాత పడుతున్నాయి.

బుధవారం ఉదయం కూడా మరో నాలుగు పావురాళ్ళు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పావురాళ్ల మృత్యువాతకు కారణం తెలియక అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.