ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (11:26 IST)

రేపటి నుండి టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
 
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం కల్పిస్తూ సీవీఎస్వో గోపీనాథ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ ఏవీఎస్వోగా ఉన్న గంగరాజును మూడో సెక్టార్‌కు బదిలీ చేశారు.

ఈ స్థానంలో అలిపిరి ఏవీఎస్వో సురేంద్రను నియమించారు. నాల్గవ సెక్టార్‌ నుంచి వీరబాబును రెండో సెక్టార్‌కు పంపి, ఈ స్థానానికి మూడో సెక్టార్‌ ఏవీఎస్వో భువన్‌కుమార్‌ను నియమించారు.

అలాగే ఐదో సెక్టార్‌ ఏవీఎస్వోగా శైలేంద్ర, ఆరో సెక్టార్‌కు వెంకటరమణ, ఏడో సెక్టార్‌కు గిరిధర్‌, తొమ్మిదో సెక్టార్‌ ఏవీఎస్వోగా నారాయణను నియమించారు.