మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (13:24 IST)

నవ్వులు పూయించిన మాజీ మంత్రి స్పీచ్... లోకేష్‌లా 'పప్పు'లా జగన్ తయారు కాగలరా?

కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన మాజీ మంత్రి పార్థసారధి చేసిన ప్రసంగానికి వైకాపా నేతలు పగలబడి నవ్వారు. వైకాపా అధినేత జగన్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు సమానంకాదంటూ మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమో

కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన మాజీ మంత్రి పార్థసారధి చేసిన ప్రసంగానికి వైకాపా నేతలు పగలబడి నవ్వారు. వైకాపా అధినేత జగన్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు సమానంకాదంటూ మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్థసారధి తనదైనశైలిలో నవ్వులు పూయిస్తూ కౌంటర్ ఇచ్చారు. 
 
ఇటీవల మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, తమ యువ నేత లోకేష్‌కు జగన్ పోటీ కాదని వ్యాఖ్యానించారు. దీనిపై పార్థసారధి స్పందిస్తూ.. "జగనంట... ఏ రోజుకీ లోకేష్‌కు సమానం కాదంట. ఎట్లా సమానమవుతారండీ? నాలాగా, లోకేష్‌లాగా, పప్పులా జగన్ తయారుకాగలరా? అని అడుగుతా ఉన్నాను. కాలేడు. ఏనాడైనా సరే జగన్ మోహన్ రెడ్డి మైకు పుచ్చుకుని, ఈ రాష్ట్రంలో తాగునీరు లేకుండా చేయగలనని చెప్పారా?
 
ఏరోజైనా సరే, జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పగలరా? అని అడుగుతా ఉన్నాను. కరెక్టే సోమిరెడ్డి గారూ... ఏరోజూ లోకేష్‌కు జగన్ సమానం కాదని చెబుతా ఉన్నాను. జగన్‌కీ లోకేష్‌కీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. లోకేష్‌ను కించపరిచేందుకుకే సోమిరెడ్డి జగన్‌తో పోలికను తెచ్చినట్టు అనుమానంగా ఉంది" అని ఎద్దేవా చేశారు.