1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (09:27 IST)

ఆస్పత్రి పాలైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఏమైందంటే?

vallabhaneni vamsi
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)లో సీటు సాధించారు. అందులో భాగంగా ఆయ‌న అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త సోమ‌వారం నుంచి పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఉన్న క్యాంప‌స్‌లో జ‌రుగుతున్న క్లాసెస్ కు హాజ‌రవుతున్నారు.
 
అయితే మంగ‌ళ‌వారం కూడా ఆయ‌న క్లాస్‌కు హాజ‌ర‌య్యారు. కానీ ఒక్క సారిగా ఆయ‌నకు లెఫ్ట్ హ్యాండ్ లాగిన‌ట్టు అనిపించింది. దీంతో వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. అక్క‌డ డాక్ట‌ర్లు ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. 
 
అయితే ప్ర‌స్తుతం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆరోగ్యం బాగానే ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఎవ‌రూ ఆందోళ‌నకు గుర‌వ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. మ‌రో రెండు రోజుల వ‌ర‌కు ఆయ‌న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యే అవ‌కాశం ఉంద‌ని డాక‌ర్లు ఫ్యామిలీ మెంబ‌ర్ల‌కు తెలియ‌జేశారు.