1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (09:11 IST)

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే.. ఠాణాలో ఫిర్యాదు

marriage
ఒడిషా రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు(బీజేడీ) విజయ్‌శంకర్‌ దాస్‌పై సోనాలిక అనే యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. 
 
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించారని, పెళ్లి చేసుకునేందుకు జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మే 17న దరఖాస్తు చేసుకోగా, అధికారులు శుక్రవారం స్లాట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
తాను కార్యాలయానికి వెళ్లినా, ఎమ్మెల్యే రాకపోవడంతో రెండుగంటల పాటు నిరీక్షించి, వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసగించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.