1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (10:51 IST)

మేనకోడలిని రేప్ చేసిన బిజినెస్‌మ్యాన్ - ఆపై చంపేస్తానంటూ వార్నింగులు

victim
తన మేనకోడలిపై ఓ బిజినెస్‌మ్యాన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు. పైగా, డి గ్యాంగ్‌తో చెప్పి ఈ భూమ్మీద లేకుండా చేస్తానని వార్నింగులు ఇచ్చాడు. ఇలా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ముంబైలో వెలుగుచూసింది. 
 
ముంబైకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ గత 2007 నుంచి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఇతర క్రిమినల్స్‌తో సంబంధాలు ఉన్నాయంటూ తనను బెదిరిస్తున్నాడంటూ 35 ఏళ్ల మహిళ అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
'నిందితుడు తొలిసారి 2007లో ఓ హోటల్‌లో తనను రేప్‌ చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత ముంబై సబర్బన్‌లోని పలుచోట్ల ఆమెపై అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని బెదిరిస్తుండేవాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తనకు స్నేహితుడని.. మరో కరడుగట్టిన నేరస్థుడు కూడా బంధువని చెబుతూ వారితో చంపిస్తానంటూ బెదిరించినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
 
అంతేకాకుండా, నిందితుడు తన నుంచి ఒక శాతం వడ్డీపై రూ.2 కోట్లు రుణంగా తీసుకున్నాడని, కానీ ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అంధేరి ప్రాంతంలో నివాసం ఉండటంతో అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎంఐడీసీ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు.