శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (12:22 IST)

బాలికపై ఏడాది పాటు సామూహిక అత్యాచారం

బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాతబస్తీలో ఏడాది నుంచి బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫతేదర్వాజకు చెందిన మహ్మద్‌ షఫిక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు అదే బస్తీకి చెందిన మరో ముగ్గురు మైనర్లు స్నేహితులు. జల్సాగా తిరిగే వీరు వ్యసనాలకు బానిసయ్యారు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అతని క్లాస్‌మేట్ అయిన ఓ బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలితో చనువుగా వుండేవాడు. మాయమాటలతో లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కూడా కన్నేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇలా ఏడాదికాలం నుంచి జరుగుతోంది. 
 
రోజురోజుకు వీరి ఆగడాలు అధికం కావడంతో... ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారి సహాయంతో కమాటీపురా పోలీసులను ఆశ్రయించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లతోపాటు, ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.