ఇటీవల సైదారాబాద్లో పట్టపగలు వృద్ధ దంపతులపై దాడి, దోపిడీ కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసే విషయంపై భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భార్య రోకలిబండతో భర్తపై దాడి చేసి ఇంట్లో కత్తితో తనకు తాను గాయపపర్చుకుని దొంగల దాడిగా సృష్టించినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు.