గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:03 IST)

మసాజ్ ముసుగులో వ్యభిచారం... అందమైన అమ్మాయిలతో క్రాస్ మసాజ్

హైదరాబాద్‌ నగరంలో వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. మసాజ్ ముసుగులో ఈ దందాను కొనసాగిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈస్ట్‌ మారేడుపల్లిలోని రాజేష్‌ కుమార్‌ అనే వ్యక్తి 'ట్రాంక్విల్‌ యూనిసెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా' పేరుతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత మసాజ్ ముసుగులో మన్నపు శ్రావణ్ కుమార్, ఎల్క విద్యా సాగర్‌ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో బుధవారం రాత్రి తుకారాంగేట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు.
 
ఆ సమయంలో మసాజ్ సెంటర్‌లో ఉన్న నిర్వాహకులు శ్రావణ్‌ కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్‌కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్‌ కుమార్‌తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.