శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (16:04 IST)

నేను సిఎం రెండో భార్యను: తాడేపల్లిలో మహిళ హల్‌చల్

ఎపి సిఎం రెండో భార్యనంటూ తాడేపల్లిలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. అడ్డుకోబోయిన స్థానికులపై రాళ్లు రువ్వడమే కాకుండా.. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపైనా ఉరకలేసింది.

ఈ షాకింగ్‌ ఘటన తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ఆఫీస్‌, సిఎం ఇంటికి అతి సమీపంలో ఉండే మహానాడులో భోగి పర్వదినాన చోటుచేసుకుంది. అయితే ఆమెకు మతిస్థిమితం లేదని తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నదీతీరం వెంబడి ఉన్న మహానాడులో మతిస్థిమితం లేని మహిళ పండగపూట హల్‌చల్‌ చేసింది. తాను సిఎం రెండో భార్యనంటూ బీభత్సం సృష్టించింది.

ఆమె మానసిక పరిస్థితి బాగోకపోవడంతో స్థానికులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆగ్రహించిన ఆమె వారిపై తిరగబడింది. స్థానికులపై రాళ్ల దాడికి ప్రయత్నించింది.

దీంతో స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మతిస్థిమితం లేని మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.

చిలకలూరిపేటకు చెందిన ధనలక్ష్మిగా ఆమెను గుర్తించారు. మహానాడుకు చెందిన ఓ వైసిపి కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.