నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల వుండే గ్రామ మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయిన కృష్ణం రాజు బ్యాంకు ఖాతాలో డబ్బు వెంటవెంటనే జమ అయ్యాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయన బ్యాంకు పుస్తకాన్ని ముందు పెట్టి ఇలా రోజుల వ్యవధిలోనే మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. ఆ డబ్బు మీకు ఎవరు జమ చేసారు, మీ ఆదాయ మార్గాలు ఏమిటి, మీకు ఈ డబ్బు ఎందుకు వేసారు, దేనికి ఈ డబ్బు మీ బ్యాంకులో జమ అయ్యింది, డబ్బును జమ చేస్తున్నవారు ఎవరు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు తెలిసింది.
పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా మురికి వ్యాఖ్యల కృష్ణం రాజు, నాకు తెలియదు... గుర్తులేదు అంటూ దాటవేసినట్లు సమాచారం. కాగా కృష్ణంరాజును మూడు రోజుల కస్టడికి తీసుకున్న పోలీసులు తుళ్లూరు ట్రాఫిక్ పోలీసు స్టేషనులో వుంచి విచారణ చేపట్టారు. దాదాపు 40 ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై మురికి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఏమైనా వుందా, మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీ వద్ద వున్న ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితుడిని మరో రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఈ మొత్తం విచారణ న్యాయవాది సమక్షంలో జరుగుతోంది.