1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 10 జులై 2021 (19:52 IST)

వ‌కీల్ సాబ్ స్ఫూర్తితో జ‌న‌సేన‌కు లీగ‌ల్ సెల్

జ‌న‌సేన పార్టీకి ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైప చిక్కులు వ‌చ్చినా ప‌రిష్క‌రించ‌డానికి ఆ పార్టీ లీగ‌ల్ సెల్ ని ఏర్పాటు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. జనసేన పార్టీ న్యాయ విభాగం అధ్య‌క్షుడిగా ఇవన సాంబశివ ప్రతాప్‌ను నియామ‌కం చేశారు. ఈ సెల్ ద్వారా న్యాయాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు.

అత్యంత కీలకమైన జనసేన పార్టీ న్యాయ విభాగం బాధ్యతలను త‌న‌ మీద నమ్మకంతో అప్పగించిన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ కు ప్ర‌తాప్ కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. వ‌కీల్ సాబ్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పవన్ కళ్యాణ్ త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించార‌ని, రాజకీయాలను సామాన్యుడికి చేరువ చేయాలన్న ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయ విభాగాన్ని తీర్చిదిద్దుతానంటున్నారు ప్ర‌తాప్.

పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తక్షణం పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందే ఏర్పాటు చేస్తాన్నారు. పవన్ కళ్యాణ్ వ‌కీల్ సాబ్ స్ఫూర్తితో ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌న్నారు.