విశాఖపట్టణంలో యువతిపై ప్రైవేట్ కారు డ్రైవర్ అత్యాచారం
విశాఖపట్టణంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి
విశాఖపట్టణంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 30 ఏళ్ల డ్రైవర్ కోసం పోలీసులు గాలించి నిందితుడిని పి.శ్రీనివాస్గా గుర్తించారు. అతను హెచ్బి కాలనీలో నివసిస్తూ సుబ్బలక్ష్మినగర్లోని ఓ ఇంటిలో కారు డ్రైవరుగా పనిచేస్తున్నట్టు తేలింది. బాధితురాలు ఇదే ఇంట్లో పనిమనిషిగా పని చేస్తూ వచ్చింది.
ఈ యువతిని గురువారం సాయంత్రం తాము పనిచేస్తున్న ఇంటి సమీపంలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది.
బాధితురాలిని పరీక్షల నిమిత్తం కింగ్ జార్జి ఆస్పత్రికి పంపించారు. అమ్మాయి మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఆమెకు 21 ఏళ్లు ఉంటాయని ఆమె యజమానులు చెబుతున్నారు.