ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు-మార్చి 31తేదీన కొత్త జిల్లాలపై నోటిఫికేషన్

శనివారం, 26 మార్చి 2022 (10:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుదిదశకు చేరుకుంది. అభ్యంతరాలను పరిశీలించి మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం కసరత్తు కూడా తుది అంకానికి చేరుకుంది.
 
ఈ రోజు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు సీఎం.
 
గంటన్నర పాటు అభ్యంతరాలపై సమీక్ష జరిపారు. పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినసంగతి తెలిసిందే. 

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments