1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. OP services started in BIRD hospital

'బర్డ్'లో ఓపి సేవలు ప్రారంభం

OP services
తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపి సేవలు పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎం.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్-19 జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ రోజుకు 50 మందికి ఓపి సేవలు అందిస్తున్నామని ఆయన వివ‌రించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు.

అత్యవసర కేసులు అడ్మిట్ చేసుకుంటున్నామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది జగన్ గారూ? రఘురామకృష్ణ రాజు