ప్రైవేటు పాఠశాలలపైనే ఎక్కువగా తల్లిదండ్రులు దృష్టి పెడుతుంటారు. కాయకష్టమో చేసుకుని తమ పిల్లలను బాగా చదివించాలనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీలో మార్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలపైన మీకు నమ్మకం పెరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందన్నారు రోజా. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను వెతుక్కుంటూ వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఎంత నమ్మకం పెరిగిందో దీన్నిబట్టి మనకు...