వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...
విజయవాడ గవర్నర్పేట, అట్టా రత్తయ్య వీధిలోని వైకాపా నేత కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మణికి చెందిన లాడ్జిలో గుట్టుగాసాగుతూ వచ్చిన వ్యభిచార తంతును స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అందమైన యువతులను పిలిపించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం అర్థరాత్రిదాటిన తర్వాత పోలీసులు ఆ లాడ్జిలో మెరుపు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో నిర్వాహకుడు ఆండ్రాజు బాలకృష్ణతో పాటు చిన్నం రంగా సాయినాథ్ తేజ, భూక్యా పూర్ణచంద్రరావు, అంగలూరి వంశీకృష్ణతో పాటు భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో భవన యజమాని అయిన వైకాపా నేత మణిని ఐదో నిందితుడుగా చేర్చారు. నిర్వాహకుడు బాలకృష్ణ పేరును మొదటి నిందితుడుగా చేర్చారు. అలాగే, ఏ2గా చిన్నం రంగాసాయినాథ్ తేజ, ఏ3గా వంశీకృష్ణ, ఏ4గా పూర్ణచంద్రరావుల పేర్లను చేర్చారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, కర్నాటకల నుంచి యువతులను తీసుకొచ్చి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు చెబుతున్నారు. యవతుల ఫోటోలను ఆన్లైన్లో ఉంచి విటులను ఆకర్షించేవారు. ఫోనులో సంప్రదించిన వారిని రహస్యంగా గవర్నర్ పేటలోని శ్రీసాయి మణి లాడ్జికి తీసుకొచ్చేవారు. ఆ తర్వాత నాలుగో అంతస్తులో ఉన్న యువతుల వద్దకు పంపి వ్యభిచారం చేయించేవారని పోలీసులు వెల్లడించారు.