1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (11:35 IST)

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం

car fire
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారులో చెలరేగిన మంటలకు నలుగురు సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు టైర్లు పేలి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారును కంటైనర్ ఈడ్చుకెళ్లింది.
 
కారు పెట్రోల్ ట్యాంకర్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు నలుగురు ఆహుతి అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.