1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (08:02 IST)

రోహిణి కార్తె వచ్చేసింది.. ఇక రోళ్లు పగిలే ఎండలు

ఇప్పటికే సూర్యుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యంత వేడిమిని పుట్టించే రోహిణి కార్తె సోమవారం నుంచి ప్రవేశించింది. దీంతో ఇక నుంచి సూర్యపాతం మరింతగా పెరగనుంది. 
 
ఈ కార్తెలో సూర్యుడు భూమికి అత్యంత దగ్గరగా ప్రవేశిస్తాడు. సుమారు రెండు వారాల పాటు రోహిణీ కార్తె కొనసాగనుంది. మరో 10 రోజుల పాటు సూర్యుడి అత్యంత తీవ్రమైన కిరణాలు భూమిని తాకుతాయి. ఆపై నెమ్మదిగా తీవ్రత తగ్గుతుంది. 
 
మరోవైపు... ఇంకా మూడు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు రోజులూ రికార్డు స్థాయి వేడి కొనసాగుతుందని, సాధ్యమైనంత వరకూ బయట తిరగకుంటేనే మంచిదని సలహా ఇచ్చారు.