సంబంధిత వార్తలు
నాతో పవన్ కల్యాణ్.. మైదానంలో జన సునామీ.. ప్రధాని
Prime Minister Modi
ఈ వేదికపై పవన్ కల్యాణ్ తనతో ఉన్నారని.. మైదానంలో జన సునామీ ఉందని చెప్పారు మోదీ. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ, పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేనానికి ప్రధాని పక్కనే సీటును కేటాయించారు. పవన్ కూర్చుంటుండగా మోదీ భుజంపై తట్టారు. ప్రతిగా జనసేనాని నమస్కారం పెట్టారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
