1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 మే 2025 (11:38 IST)

44 ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Pakistan Train
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 44 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు ఈ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపనుంది. మొత్తం 44 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంది. వీటిలో విశాఖపట్టణం - బెంగుళూరు ప్రాంతాల మధ్య జూన్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుంచి విశాఖపట్టణంకు ప్రతి సోమవారం నడుపుతారు. 
 
అదేవిధంగా విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య మధ్య జూన్ 4వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ప్రతి బుధవారం, తిరుపతి నుంచి విశాఖపట్ణంకు జూన్ 5 నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రతి గురువారం, విశాఖపట్టణం నుంచి చర్లపల్లి మధ్య జూన్ 6వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు శుక్రవారం, చర్లపల్లి నుంచి విశాఖపట్టణంకు జూన్ 6వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరింది.