1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అసని తుఫాను ఎఫెక్టు - పలు రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

trains
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో  పశ్చి మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశఁ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కూడా ఆరు రైళ్లను రద్దు చేశారు. 
 
నేడు రద్దు చేసిన రైళ్ళలో గుంటూరు రైపల్లే, రేపల్లే గుంటూరు, గంటూరు రేపల్లే, రేపల్లే గుంటూరు, రేపల్లె తెనాలి, కాకినాడ పోర్టు విశాఖపట్టణం, విశాఖపట్టణం కాకినాడ పోర్టు రైళ్లు ఉన్నాయి. అలాగే, గుంటూరు రోడు - డోన్ రైలును రీషెడ్యూల్ చేశారు ఈ రైలు బుధవారం మధ్యాహ్నం  ఒంటి గంటకు బయలుదేరాల్సివుండగా, మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు, తుఫాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, అసని తుఫాను గురువారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.