మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏటి.. ఏటి ఈ ఫుడ్డేంటి... నీ సంగతేంటి.. యాక్షన్‌లోకి వెళ్లిపోతా.. స్పీకర్ సతీమణి వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ మధ్యాహ్న భోజన అధికారులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా పోటీ ఎన్నికైంది. 
 
ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన వాణిశ్రీ.. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు స్థానిక సమస్యలను వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. 
 
అన్నం దారుణంగా ఉండడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధింత అధికారులకు ఫోన్ చేసి చెడామడా వాయించేశారు. ఇదేమన్నా పిల్లలు తినే అన్నమేనా..? అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు పలుమార్లు హెచ్చరించానని, ఇక యాక్షన్ లో దిగుతానని స్పష్టం చేశారు. స్పష్టమైన ఆధారాలతో సీఎం జగన్‌ను కలుస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.