మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (10:49 IST)

ఏపీలో కాకపుట్టిస్తున్న అమరావతి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ!

suprem court
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంశం కాకపుట్టిస్తుంది. నవ్యాంధ్రకు రాజధానిగా ప్రకటించిన అమరావతిని అభివృద్ధి చేయాలంటూ లోగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీన్ని వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కారు పేర్కొంది. అందువల్ల హైకోర్టు తీర్పు స్టే విధించాలని కోరింది. 
 
మరోవైపు, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను వేశారు. ఒకేచోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఈ పిటిషన్‌లు అన్నింటిపై మంగళవారం విచారణ జరుపనుంది. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. 
 
దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం, మరో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్‌లు తమతమ వాదనలు వినిపించనున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.