1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (14:40 IST)

జేసీ అబద్దాలు చెపుతున్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న పూసపాటి

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజప

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజపతిరాజు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ముఖ్యంగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగోతో పాటు.. ఏడు ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేశాయి. దీంతో ఈ ఏడు విమానయాన సంస్థల్లో జేసీ ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. మరోవైపు... 'వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో అసలు ఏం జరిగిందన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటాం' అని అశోక్ గజపతి రాజు చెప్పారు.