1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (15:56 IST)

సూర్యనారాయణ స్వామిని తాకిన భానుడి కిరణాలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని భానుడి కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం 6.21 నుంచి 6.30 గంటల వరకు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.

9 నిమిషాలపాటు ఈ దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి. ఏటా మార్చి 9,10 తేదీల్లో స్వామిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఆనవాయితీ.

మళ్లీ అక్టోబర్‌ 1,2 తేదీల్లో కూడా సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తుంటారు.