1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:45 IST)

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కోన శశిధర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్‌,  వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్‌ నియమితులయ్యారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బదిలీలు, నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.