శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (16:16 IST)

డిసెంబర్ 8,9 తేదీలలో విశాఖ నుంచి జగన్ పరిపాలన?

jagan ys
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 8,9 తేదీలలో విశాఖపట్నం పరిపాలన చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు గతంలో ఏపీ సర్కారు ప్రకటించింది. సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించి సమగ్ర సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
 
సన్నాహక చర్యల్లో భాగంగా విశాఖపట్నంలో వివిధ శాఖల అధికారులకు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం. 
 
ఈ నిర్ణయం డిసెంబర్ 8 నుండి విశాఖపట్నం నుండి రాష్ట్ర పరిపాలన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని సూచించడం పాలక వర్గాల్లో చర్చలకు దారితీసింది.
 
అలాగే అమరావతి నుండి అనేక మంది అధికారులు తమకు కేటాయించిన కార్యాలయాల గురించి వివరాలను కోరుతూ జిల్లా అధికారులను సంప్రదించినట్లు సమాచారం.