బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్తను చంపేసిన ముగ్గురు పిల్లల తల్లి!

murder
వివాహేతర సంబంధాలు, ఆన్‌లైన్ పరిచయాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. హత్యలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా ముగ్గురు పిల్లల తల్లి తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్తను చంపేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. ఈ దారుణం ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆళ్లగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ కరీముల్లా అనుమానాస్పదరీతిలో హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కరీముల్లా భార్య మాబ్బి ఫోన్ నుంచి కడప జిల్లా పెద్దముడియం మండలం జె.కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీకుమార్ రెడ్డితో ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈయన ఫేస్‌బుక్ ద్వారా మాబ్బికి పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని పబ్బి భావించింది. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చేరవేసింది. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన మద్యం సేవించి ఇంట్లో నిద్రపోతున్న కరీముల్లా మెడకు తీగ బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. 
 
తర్వాత రోజు ఇద్దరూ కలిసి కరీముల్లా మృతదేహాన్ని తీసుకెళ్లి పొదల్లో పడేశారు. మాబ్బి వయసు 33 సంవత్సరాలుకాగా, ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వంశీకుమార్ రెడ్డి వయస్సు 22 యేళ్లు. కరీముల్లాను హత్య చేసిన తర్వాత మాబ్బి, వంశీకుమార్ రెడ్డిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
హత్య చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎన్నో రకాలైన ప్లాన్లు వేశారు. చివరకు ఆమ ప్రవర్తనను సందేహించిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడు వంశీకుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.