సంబంధిత వార్తలు
- 15న వాహన మిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు డబ్బు జమ
- రేపిస్టులను పట్టించిన వీర్యకణాలు ... ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు..
- నా మైండ్ ఎప్పుడెలా వుంటుందో చెప్పలేనుః విజయ్దేవర కొండ
- తమ అన్ని బ్రాండ్లపై ఉచిత సర్వీస్ పీరియడ్ను విస్తరించిన బజాజ్ ఆటో
- ఉద్యోగులకు బజాజ్ వరాలు: ఉద్యోగి మరణిస్తే రెండేళ్లు జీతం, కుటుంబ సభ్యులకు ఐదేళ్లు హాస్పిటలైజేషన్ బీమా ఖర్చు
వైఎస్సార్ వాహనమిత్ర: రూ.248.46 కోట్లు కేటాయింపు
వైఎస్సార్ వాహనమిత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లలో వెయ్యనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ వాహన మిత్రను ప్రారంభించి వారికి అండగా నిలవనున్నారు.
ఈ పథకం కింద గతేడాది 2లక్షల 24వేల 777మంది లబ్ధిదారులుగా ఉండగా.. ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు.
మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మందిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలవారు.
