గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (12:25 IST)

పీఏసీ ఛైర్మన్‌గా తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు. ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. అలాగే, ఎస్టిమేట్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. 
 
పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం గురువారం నియమించారు. 
 
పబ్లిక్‌ అకౌంట్‌ కమిటి సభ్యులుగా:
 1. పయ్యావుల కేశవ్‌ (ఛైర్మన్‌), 2.సంజీవయ్య కిలిబెటి, 3.కోలగట్ల వీరభద్ర స్వామి, 4.మేరుగు నాగార్జున, 5.భూమన కరుణాకర్‌ రెడ్డి, 6.కరణం ధర్మశ్రీ , 7.జోగి రమేష్‌, 8.కెవి.ఉషశ్రీ చరణ్‌, 9.కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, 10.బీద రవీచంద్ర, 11.డి.జగదీశ్వరరావు, 12.బాలసుబ్రమణ్యం, 
 
ఎస్టిమేట్‌ కమిటీ సభ్యులుగా: 1. రాజన్న దొర పీడిక(చైర్మన్‌), 2. అమర్‌నాథ్‌ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, 4. కిరణ్‌ కుమార్‌ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్‌ కుమార్‌ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్‌, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్‌బాబు, 12. వెన్నపూస గోపాల్‌రెడ్డి
 
పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ సభ్యులు: 
1. చిర్ల జగ్గిరెడ్డి(చైర్మన్‌) 2. గ్రంథి శ్రీనివాస్‌, 3. కిలారి వెంకట రోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్‌రెడ్డి , 8. చంద్రశేఖర్‌రెడ్డి, 9. వాసుపల్లి గణేష్‌ కుమార్‌10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్‌రెడ్డి, 12. సోము వీర్రాజు.