మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (21:38 IST)

ఖాళీగా వుందని గిరిజన పాఠశాలను ఆక్రమించుకున్న వైసిపి నాయకుడు

School
School
ఏపీ సీఎం జగన్ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది వైకాపా నేతల్లో మార్పు రావట్లేదు. కొందరు నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా పాణ్యంలో ఓ వైసీపీ నేత బరితెగించిన విధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళ్తే, పాణ్యంలోని ఇందిరా నగర్‌లో చెంచు గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2013లో రూ. 5.30 లక్షలతో పాఠశాలను నిర్మించింది. అయితే ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే కారణంతో దాన్ని మూసేశారు. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే స్కూల్‌కు తరలించారు. 
 
ఈ స్కూలును స్థానిక వైసీపీ నేత ఆక్రమించుకున్నారు. తాను అందులో నివసించేందుకు వీలుగా బిల్డింగ్‌లో మార్పులు కూడా చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.