గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (12:24 IST)

బొజ్జ కరగాలంటే.. వేపు పువ్వు పొడిని.. ఇలా వాడాలట..

వేపుపువ్వు ఎంత మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వేపవువ్వు సహజ యాంటీబయోటిక్‌. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువే. అలాంటి వేప పువ్వును ఎండబెట్టి పొడికొట్టుకుని.. కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం ద్వారా మధుమేహం, గ్యాస్ సమస్యలు, జలుబు, దగ్గు, నోటిపూత తగ్గిపోతాయి. 
 
వేపపువ్వుకి కొవ్వునీ పొట్టనీ కరిగించే గుణం కూడా ఉంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్లసమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకునో లేదా చారుల్లో కూరల్లో వేపపువ్వు పొడిని వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఈ పొడిని తేనెలో కలిపి గాయాలూ పొక్కులమీద రాసినా, నూనెలో కలిపి బ్లాక్‌హెడ్స్‌మీద రాసినా అవి క్రమంగా తగ్గిపోతాయి. 
 
చర్మంమీద దద్దుర్లు, పొక్కుల్లాంటివి వస్తే కాసిని వేపాకు పువ్వులను మెత్తగా నూరి రాస్తే ఇన్ఫెక్షన్లు క్రమంగా తగ్గుతాయి. వేప పువ్వుల పొడిని పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ తొలిగిపోవడంతోబాటు కాలేయం శుభ్రపడుతుంది. ఈ పేస్టుని క్రమం తప్పకుండా తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల దురద, చుండ్రు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.