1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with green tea and rice water

గ్రీన్ టీ, బియ్యం నీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గ్రీన్ ‌టీలో తేనెను, బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌ను ఉడికించుకుని అందులో కొద్ది

green tea
గ్రీన్ ‌టీలో తేనెను, బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌ను ఉడికించుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

 
ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. పసుపులో కొద్దిగా నిమ్మరసం, పాలు కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా రసంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా మారుతుంది. ముడతలు తొలగిపోతాయి. కొబ్బరి పాలను ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కోమలంగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?