1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. rice water and lemon beauty face care tips

బియ్యం నీటిలో కాస్త నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చే

rice
బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 1 స్పూన్ గ్రీన్ టీని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్న ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
 
ఇలా చేయడం ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చును. అదే మోతాదు బియ్యం నీటిలో స్పూన్ తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. అంతే మెుటిమల చర్మం కాస్త మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కాస్త బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఈ విధంగా చేయడం వలన మృదువైన, కోమలమైన చర్మాన్ని పొందవచ్చును. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పాలు పౌడర్‌లో బియ్యం నీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

చివరగా 4 స్పూన్ల బియ్యం నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రతిరోజూ పొన్నగంటి ఆకుకూరను తీసుకుంటే?