1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
  4. Amaravati Farmers Get Capital Gains Tax

అమరావతికి భూములిచ్చిన రైతులకు అరుణ్ జైట్లీ వరం

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహ

Arun Jaitley
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపును ఇచ్చారు. 
 
బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్‌లో ఈ వరాన్ని జైట్లీ ప్రకటించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మినహాయింపును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం గతంలో జైట్లీని కోరింది. ఈ కోరిక మేరకు ఆయన ఈ వరాన్ని ప్రకటించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ కోర్కెను ఆయన మన్నించినట్టయింది. 
 
అయితే, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యాసంస్థల నిర్మాణం, పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు నిధులు, ఇతర పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన మాటమాత్రం ప్రస్తావించక పోవడం గమనార్హం. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ.6 వేలు నగదు... మహిళా శిశు అభివృద్ధికి రూ.1.84 కోట్లు