శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:40 IST)

హాంకాంగ్‌లో ఎయిరిండియా విమానాలపై వారం బ్రేక్

airindia
హాంకాంగ్‌లో ఎయిరిండియా విమానాలపై వారం రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షా ఫలితాల్లోని కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌తో మాత్రమే అనుమతిస్తామని హాంకాంగ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో పాటు హాంకాంగ్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
ఏప్రిల్ 16న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో న్యూఢిల్లీ, కోల్‌కతా నుంచి వచ్చే ఎయిరిండియా విమానాలను ఏప్రిల్ 24వరకూ రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.  
 
మరోవైపు రెండు నెలలుగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని షాంఘై సహా తూర్పు ప్రాంతంలోని 27 నగరాలలో కఠిన లాక్ డౌన్, 17 నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు అధికారులు.