1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (11:34 IST)

భోజనం చేస్తే రూ.31.66 కోట్లా?

అవును.. ఓ వెరైటీ వేలంలో.. భోజనం చేస్తే రూ.31.66 కోట్లు. ఈ మొత్తాన్ని ఓ యువకుడు దక్కించుకున్నాడు. షేర్ మార్కెట్ జాంబవంతుడు అయన వారెన్ బఫెట్.. మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు గాను ఈ ఏడాది జరిపిన వేలంలో జస్టిన్ సన్ అనే చైనా యువకుడు గెలుపొందాడు. 
 
శాన్ ఫ్రాన్సిస్కోలో క్లైంట్ అనే స్వచ్ఛంధ సంస్థ కోసం గత 19 సంవత్సరాల పాటు ఇలాంటి విభిన్న వేలాన్ని నిర్వహిస్తోంది వారెన్ బఫెట్. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఆ సంస్థకు పంపుతుంది. ఈ వేలంలో జస్టిన్ గేట్ వేలానికి దాదాపు 31.66 కోట్లు చెల్లించాడు.