1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:03 IST)

మళ్లీ పెట్రో వడ్డన : ప్రజలపై మరింత భారం

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. కేంద్రం ఆధీనంలోని చమురు కంపెనీలు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. 
 
తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్‌ మంగళవారం 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. 
 
దేశ రాజధానిలో ఒక లీటర్‌ డీజిల్‌‌ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని సోమవారం భారత్‌ బంద్‌ ద్వారా ప్రజాగ్రహం చవిచూసినా కూడా వాటి ధరలు పెరగడంతో కేంద్ర మొండి వైఖరి పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.