గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 అక్టోబరు 2016 (16:25 IST)

మూలిగే నక్కలపై తాటికాయలు పడ్డాయ్.. Jio కాల్స్ కనెక్ట్ చేయరా...? కట్టండి రూ.3000 కోట్లు

రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనల

రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనలను సంస్థలు ఉల్లంఘించడాన్ని ట్రాయ్‌(టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తప్పుబడుతూ ఏకంగా రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
ఈ మేరకు తన సిఫారసులను టెలికాం శాఖకు సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ప్రకారం అత్యధికంగా వొడాఫోన్ పైన రూ. 1050 కోట్లు, ఐడియా పైన రూ. 950 కోట్లు, ఎయిర్ టైల్ పైన రూ.50 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు మొండికేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే.