శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (21:43 IST)

రూ.1299కే విమాన టిక్కెట్ : మాన్‌సూన్ సేల్ పేరుతో విస్తారా ఆఫర్

దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న మరో ప్రైవేట్ విమానయాన సంస్థ విస్తారా. ఈ సంస్థ దేశంలోని పలు నగరాలను విమాన సర్వీసులను నడుపుతోంది. ఇపుడు మాన్‌సూన్ సేల్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్‌లో రూ.1299కే టిక్కెట్ ధరను ప్రకటించింది. అయితే, ఈ టిక్కెట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారు జూలై 3వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ మధ్య ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. 
 
కాగా, ఇటీవల విస్తారా సంస్థకు 62 కొత్త విమానాలు వచ్చి కలిశాయి. దీంతో విమానాల సంఖ్య 170కి చేరింది. ఈ సంస్థ ప్రతి రోజూ 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి 10 నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్‌సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.