దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ సహా గ్రామీణాభివృద్ధిశాఖలో జరుగుతున్న పనులన్నింటినీ జియోట్యాగింగ్ చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) లోని సెంటర్ ఫర్ జియో ఇన్ఫర్మాటిక్ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ (సీజీఏఆర్డీ) ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా చేసిన పనుల్లో 4,29,87,030 జియోట్యాగింగ్ పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా 2.75లక్షల మందికి దీనిపై శిక్షణ ఇచ్చారు. జియోట్యాగింగ్కు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యం దృష్ట్యా దూరవిద్య...