COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్

సెల్వి
మంగళవారం, 27 మే 2025 (09:25 IST)
కరోనా ఏపీని కూడా తాకింది. ఏపీలో మూడు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఈ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు వున్నారు. వీరిలో వృద్ధుని పరిస్థితి విషమంగా వుందని.. వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు. 
 
గతంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసింది. 
 
ఇకపోతే దేశంలో మేనెలలో కరోనా కేసులు పెరిగాయి. కేరళ, మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 26నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments