1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (11:42 IST)

సెకండ్ వేవ్: తెలంగాణలో కరోనా.. కొత్తగా 158 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో చేసిన కరోనా టెస్టులకుగాను 0.38 శాతం మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్టు బయటపడింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 40,616 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 158 మంది కోవిడ్‌-19 బారిన పడ్డట్టు వెల్లడైంది.
 
తాజాగా కరోనాతో ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1641కు చేరింది. మరో 628 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ములుగు, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జీహెచ్‌ఎంసీలో 30, రంగారెడ్డి15, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒకరు వ్యాధి బారిన పడ్డారు.
 
ఇకపోతే.. దేశంలోనూ గత కొన్ని రోజులుగా రోజుకు 16 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు మరింత పెరిగాయి. 
 
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,599 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398 కి చేరింది. ఇందులో 1,08,82,798 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,88,747 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 97 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,853 కి చేరింది.