కఠినంగా లాక్ డౌన్.. తాట తీస్తున్న పోలీసులు.. ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపేశారు..

ఆదివారం, 6 జూన్ 2021 (21:09 IST)
కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు బలాదూర్‌గా తిరగుతూ పోలీసులకు చిక్కారు. 
 
కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు బాధ్యతా రాహిత్యంతో నిబంధనలు గాలికి వదిలి బయట తిరుగుతున్నారు. దీంతో 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
 
జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

తర్వాతి కథనం
Show comments