ఐదో టెస్టులో అరుదైన ఫీట్: ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించారు..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్తో సిరీస్లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు.
1978-79 సీజన్ తరువాత ఒక సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేసుకుని కొత్త ఫీట్ను అందుకున్నారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే.
ఇకపోతే.. ఈ మ్యాచ్లో నాయర్ సెంచరీని నమోదు చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్ లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు సెంచరీలు నమోదు చేసుకున్నారు.