1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Rishabh Pant to donate match fee towards rescue operations in Uttarakhand

భారత వికెట్ కీపర్ ఔదార్యం... ఉత్తరాఖండ్‌కు విరాళంగా మ్యాచ్ ఫీజు

Rishabh Pant
భారత క్రికెట్ జట్టులోని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొన్నటికిమొన్న ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ఈ కుర్రోడు.. ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ బాగా రాణిస్తున్నాడు. అదేసమయంలో తన ఔదార్యాన్ని చూపించారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. దీంతో గంగానది ఉపనది ధౌలతీగంగపై నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయింది. ఈ విపత్తులో 150మంది వరకు గల్లంతైనట్టు సమాచారం. 
 
తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ కోరారు. 
 
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చెన్నై టెస్ట్ మ్యాచ్ : భారత్‌పై ఇంగ్లండ్ సానుభూతి.. ఫాలో ఆన్ లేకుండానే..