సంబంధిత వార్తలు
- ధౌలిగంగ నదిలో పెరిగిన నీటిమట్టం.. విరాళంగా మ్యాచ్ ఫీజు
- ఉత్తరాఖండ్ జలప్రళయంపై హీరో మహేష్ బాబు విచారం.. వారంతా...
- విరిగిపడిన మంచు చరియలు.. తపోవన్ విద్యుత్ ప్లాంట్కు ముప్పు: 150 మంది గల్లంతు
- ఉత్తరాఖండ్లో పెను విపత్తు : కొండ చరియలు విరిగిపడి...
- బుమ్రా రికార్డుకు చెక్ పెట్టిన రిషబ్ పంత్.. అలా దూరమైంది..?
భారత వికెట్ కీపర్ ఔదార్యం... ఉత్తరాఖండ్కు విరాళంగా మ్యాచ్ ఫీజు
భారత క్రికెట్ జట్టులోని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొన్నటికిమొన్న ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ఈ కుర్రోడు.. ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ బాగా రాణిస్తున్నాడు. అదేసమయంలో తన ఔదార్యాన్ని చూపించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. దీంతో గంగానది ఉపనది ధౌలతీగంగపై నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయింది. ఈ విపత్తులో 150మంది వరకు గల్లంతైనట్టు సమాచారం.
తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ కోరారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
