1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:56 IST)

ధౌలిగంగ నదిలో పెరిగిన నీటిమట్టం.. విరాళంగా మ్యాచ్ ఫీజు

Uttarkhand
ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగ నదిలో ఆ రాత్రి మరోసారి నీటిమట్టం పెరిగింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం నందా దేవి హిమానీనదం విరిగిపడింది. దీంతో ధౌలిగంగ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో చమోలీ ప్రాంతంలో పోలీసుల ప్రజలను అప్రమత్తం చేశారు. 
 
తపోవన్‌-విష్ణుగఢ్‌ హైడర్‌ ప్రాజెక్టు టన్నల్‌లో 35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాలతో టన్నల్‌ వద్ద శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
 
ఇండియన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. ఉత్తరాఖాండ్ ఘటన బాధితులకు తన వంతు సహాయంగా మ్యాచ్ ఫీజును విరాళమిచ్చాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై పంత్ ఫీలింగ్‌ను ట్వీట్ రూపంలో వెల్లడించాడు.
 
ఉత్తరాఖాండ్ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి చాలా ఫీలయ్యా. వీలైనంత మందికి సహాయపడదామనే ఉద్దేశ్యమంతో నా మ్యాచ్ ఫీజు విరాళమివ్వాలనుకుంటున్నా’ అని పంత్ ట్వీట్ చేశాడు.